ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు

నవతెలంగాణ – తిరుమలగిరి 
తిరుమలగిరి మండల కేంద్రం లో పోలింగ్ బూత్ నెంబర్ 448,449 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో  పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్సోజు నరేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జిమ్మిలాల్, జిల్లా నాయకులు సుంకరి జనార్ధన్, దుంపల కృష్ణారెడ్డి వారి సతీమణి, ఎన్ ఎస్ యు ఐ  జిల్లా అధ్యక్షుడు కందుకూరి అంబేద్కర్, మీడియా ఇన్ఛార్జి కందుకూరి లక్ష్మయ్య సతీమణి మంగ, నాయకులు శాగంటి రాములు, ఎల్సోజు నవీన్, నవతెలంగాణ రిపోర్టర్ నెల్లుట్ల రాజు సతీమణి సునీత, తదితరులు వారి ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కు కలిగి ఉన్న పట్టభద్రులు  ప్రతి ఒక్కరు విధిగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు.

Spread the love