బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు..

  – కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్
: చౌటుప్పల్ మండలం జై కేసారం గ్రామపంచాయతీ ఇద్దరు వార్డు సభ్యులు గురువారం బీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో చేరారు.ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని మునుగోడులో గెలిచేది కారు గుర్తునని అన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, జై కేసారం సర్పంచ్ కొర్పురి సైదులు, మాజీ జడ్పిటిసి పెద్దిటి బుచ్చిరెడ్డి, ఢిల్లీ మాధవరెడ్డి, చిన్నం బాలరాజు, మెట్టు మహేశ్వర్ రెడ్డి వార్డు సభ్యులు పల్లె శ్రీకాంత్, ఎడ్ల ముఖేష్ తదితరులు పాల్గొన్నారు

Spread the love