కాలనీవాసుల సమస్యలను పరిష్కరిస్తాను: మేయర్  నీతూ కిరణ్

నవ తెలంగాణ-కంటేశ్వర్

నగరం లోని వినాయక నగర్ వైష్ణవి రెసిడెన్సి పరిసర ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని నగర మేయర్  నీతూ కిరణ్ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం ఉదయం వినాయక నగర్ వైష్ణవి రెసిడెన్సి ప్రాంతములోని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగు నీటి సమస్యల గురించి తనిఖీ చేశారు. విద్యుత్ అధికారులు ,మున్సిపల్ అధికారులతో కలిసి వైష్ణవి రెసిడెన్సి వాసులను ,కాలనీ వాసులతో వారు మాట్లాడి సమస్యల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని, మురికి నీరుని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ద్వారా పంపేందుకు కనెక్షన్ ఏర్పాట్లు చేయాలని, రాత్రి వేళలో ఇబ్బందులకు గురవుతున్న దృష్ట్యా వీధి దీపాలను వెంటనే ఏర్పాటు చేయాలని, మిషన్ భగీరథ నీటి ట్యాంకు ద్వారా వైష్ణవి రెసిడెన్సికి మంచినీరు కనెక్షన్ ఇవ్వాలని, అధికారులను ఆదేశించారు. మేయర్ గారిని కలిసిన వారిలో వైష్ణవి రెసిడెన్సి కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి నిర్మల హృదయ, ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, కోశాధికారి సురేష్, సలహాదారులు కే.రామ్మోహన్రావు, కమిటీ నాయకులు ప్రభాకర్, పద్మ, జాన్సన్, మధుసూదన్, ప్రవీణ్, పార్థసారథి, తదితరులు ఉన్నారు.
Spread the love