![](https://navatelangana.com/wp-content/uploads/2024/06/IMG-20240614-WA0460.jpg)
మండలంలోని అశ్వారావుపేట ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మారుమూల గ్రామ మైన మొద్దులమడ లో శుక్రవారం డాక్టర్ క్రిష్ణ దీపక్ రెడ్డి పర్యవేక్షణలో ఆరోగ్య శిభిరం నిర్వహించారు. ఈ శిభిరం లో 35 మందికి సాధారణ,చిరు వ్యాదులకు చికిత్స చేసి,అవసరం అయిన మందులు అందజేసారు. అనంతరం ప్రజలకు వర్షాకాలంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ శ్రీనివాస్, ఆరోగ్య సిబ్బంది సత్యనారాయణ, చెల్లెమ్మ ,ఆశా కార్యకర్త పాల్గొన్నారు.