గంప నాగేందర్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

నవతెలంగాణ – భువనగిరి

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గంప నాగేందర్ తల్లి మంచాల సరోజనమ్మ వారం రోజుల క్రితం  అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న  ఐటి, పురపాలక శాఖ  రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు గంప నాగేందర్ స్వగ్రామమైన భువనగిరికి ఆదివారం వచ్చారు. ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నాగేందర్ కుటుంబాన్ని పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రి వెంట ఆలేరు ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య పిసిసి కార్యదర్శి పోత్నాక్ ప్రమోద్ కుమార్ పీసీసీ ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు తంగళ్ళపల్లి రవికుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, రైస్ మిల్లర్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు పసుపునురి నాగభూషణం, మార్తా వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు బీస్కుంట సత్యనారాయణ లు ఉన్నారు.
Spread the love