రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు మిసిమి విద్యార్థినిలు

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని మిసిమి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినిలు రియ, గగన శ్రీ, నమిత రాష్ట్రస్థాయి హ్యాండ్  బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ బాలి రవీందర్  తెలిపారు. ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఆర్మూర్ నవ్య భారతి గ్లోబల్ హై స్కూల్లో సీనియర్ బాలికల  విభాగంలో హ్యాండ్ బాల్ ప్రాబబుల్ జట్ల ఎంపిక నిర్వహించారు. ఈ పోటీల్లో మిసిమి పాఠశాల విద్యార్థులు రియ, గగన శ్రీ, నమిత ఉత్తమ ప్రతిభ కనబరిచి నిజామాబాద్ జిల్లా జట్టుకు ఎంపికైనట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో ఈ నెల 17,18,19 తేదీల్లో జరగబోయే 53వ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్  పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకారులను, వ్యాయామ ఉపాధ్యాయుడిని  పాఠశాల కరస్పాండెంట్ బాలి రవీందర్, ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య, ఉపాధ్యాయ బృందం  ప్రత్యేకంగా అభినందించారు.
Spread the love