నవతెలంగాణ – తిరుమలగిరి
తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని మాలిపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు కేసిడి దేవిరెడ్డి సంతాప సభకు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్. ఈ కార్యక్రమంలో వారితోపాటు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వై.నరేష్, మున్సిపల్ చైర్మన్ శాగంటి అనసూయ రాములు,జిల్లా నాయకులు సుంకరి జనార్ధన్, పేరాల వీరేష్, మందుల సూర్య కిరణ్, ధరావత్ జుమీలాల్ తదితరులు పాల్గొన్నారు.