నవతెలంగాణ క్యాలెండర్ ను ఆవిష్కరించిన: ఎమ్మేల్యే జయవీర్

నవతెలంగాణ -పెద్దవూర
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రూపొందించిన నవతెలంగాణ 2024 నూతన సంవత్సరం క్యాలెండర్ ను నాగార్జున సాగర్ ఎమ్మేల్యే జయవీర్ రెడ్డి శుక్రవారం మండల కేంద్రం లోని గ్రామ పంచాయతీలో ఆవిష్కరణ చేశారు. మాట్లాడారు నూతన సంవత్సరంలో నవతెలంగాణ పత్రికకు మంచి ఆదరణ లభించాలని, నేటి పోటీ ప్రపంచంలో మిగతా పత్రికలకంటే ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. పత్రికలు నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావాలని, అందులో నవతెలంగాణ పాత్ర ప్రత్యేకమైనదని అన్నారు. ఏ పార్టీకి కొమ్ము కాయకుండా, ప్రజల కష్టాలను తెలుసుకుంటూ అధికారుల, పాలకులకు వారధిగా పని చేసి ప్రజా సమస్యలు తీర్చేందుకు కృషి చేయాలన్నారు. ఎలాంటి అవరోధాలు, ఇబ్బందులు రాకుండా ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖసంతోషాలతో ఉండాలని, అలాగే నాయకులకు, అధికారులకు, ప్రజలకు, పత్రిక యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నవతెలంగాణ స్థానిక విలేకరి మూల శేఖర్ రెడ్డి, జెడ్పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షులు తుమ్మల పల్లి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ చెన్ను అనురాద సుందర్ రెడ్డి, సర్పంచ్, ఎంపీడిఓ విజయకుమారి,నియోజకవర్గం యూత్ అధ్యక్షులు పగడాల నాగరాజు, జిల్లా యువ నాయకులు గడ్డంపల్లి వినయ్ రెడ్డి, పెద్దిరెడ్డి ఉపేందర్ రెడ్డి, ప్రసాద్, ఉంగరాల శ్రీనివాస్, మండల అధ్యక్షులు పబ్బుగిరి, మండలయూత్ అధ్యక్షులు కిలారీ మురళీ కృష్ణ యాదవ్, మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు చామల సువర్ణ, కార్యదర్శి ఢాకు నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటయ్య, వూరే వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Spread the love