సాగర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది పథంలోకి తీసుకెళ్తా: ఎంఎల్ఏ జయవీర్

నవతెలంగాణ – పెద్దవూర
నాగార్జున సాగర్ నియోజకవర్గం లో మిగిలిన పోయిన పనులన్నీ పూర్తి చేసి ఇంకా అభివృద్ధి పథం లోకి తీసుకెళ్తానని సాగర్ శాసన సభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం గిరిజన చైతన్య యాత్ర చెప్పట్టి ఏడాది పూర్తి అయిన సందర్బంగా మండలం లో ఉట్ల పల్లి గ్రామంలో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరణ చేసి అనంతరం జరిగిన సమ్మెళన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గత ఏడాది ఇదే రోజున గిరిజన చైతన్య యాత్ర గేమ్యానాయక్ తాండ నుంచి ప్రారంబించి నియోజకవర్గం 200 పైగా తండాలలో పాదయాత్ర చేపట్టామని నాకు సహకారం అందించిన వారందరికీ ఎంతో రుణపడివున్నానని అన్నారు. నియోజవర్గంలోని ప్రతి గిరిజన తండాను  తిరుగుతూ గిరిజనులను చైతన్య పరుస్తూ  ముందుకు సాగిన విషయం మీకందరికి తెలిసిందే అని అన్నారు. మండలంలో అన్నీ వర్గాల ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. మళ్ళీ నియోజకవర్గంలోనే ఉన్న గిరిజన తండాలను మమేకం చేస్తూ  జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తామని ఉన్నారు. మండల అధ్యక్షులు పబ్బు యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మల పల్లి చంద్ర శేఖర్ రెడ్డి,మాజీ ఎంపీపి రమావత్ శంకర్ నాయక్,వాసుదేవుల రవీందర్ రెడ్డి,బీరెడ్డి బాల్ రెడ్డి,గడ్డం పల్లి వినయ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు కిలారి మురళీ కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love