బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే మదన్ మోహన్ పరమార్శ

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని ముదెల్లి గ్రామంలో ఇటీవల ప్రమాదవశత్తు చెరువులో పడి మృతి చెందిన ఇద్దరు చిన్నారులు మిద్దెల రవి, సుతారి శశాంక్  కుటుంబ సభ్యులను  ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఉద్దేశించి పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లిస్తానని అదేవిధంగా కలెక్టర్  చెప్పి ఇరు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా వచ్చేటట్టు చూస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన కార్యకర్తలు మరణించిన విషయం తెలుసుకొని, పరికొండ కాశీరాం వారి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చి తనకొచ్చే ఎమ్మెల్యే జీతం డబ్బుల  నుంచి ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా పుట్టి ప్రభాకర్ కుటుంబ సభ్యులకు ఆ ఇద్దరు చిన్నారులను గురుకుల పాఠశాలలో చేర్పించి వారికి విద్యను అందిస్తానని, అదేవిధంగా తన వంతు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. కమ్మరి గోపాల్, లద్దాఫ్ హైమద్ కుటుంబాలకు పరామర్శించి భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో ముదెల్లి మాజీ సర్పంచ్ కాగుల పద్మమోహన్ యాదవ్ మరియు ఎం వై ఎఫ్ సభ్యులు కాగుల రమేష్ యాదవ్ వినోద్ రాథోడ్ నాజర్ అదేవిధంగా కార్యకర్తలు వడ్డే పెద్దరాజు పాల్తి నారాయణరావు దేశాన్ని సాయిలు బల్గూరి రాజు మంగమ్మగారి శ్రీనివాసరావు టేకుమల్లి రవి వడ్నాల హనుమాన్లు కర్రెల సాయిలు  కిరణ్ గౌడ్ బంటు సాయిలు గులాo అలి, ఎండి అన్వర్ రజాక్, బంధు సాబ్ హనుమాన్ కమిటీ సభ్యులు బంజ కాశీనాథ్ మొగులగౌడ్ కుమ్మరి ఆశయ్య మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love