- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో బాధిత కుటుంబాన్ని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సోమవారం పరామర్శించారు. గ్రామానికి చెందిన ఉట్నూర్ రాజేష్ (ధోనీ) వాళ్ల తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనారోగ్యానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.మృతురాలి చిత్రపటానికి పుష్పంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వెంట టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మైలారం సుధాకర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
- Advertisement -



