వంద ఫీట్ల రోడ్డు మార్గాన్ని  సర్వే చేపిస్తాం: ఎమ్మెల్యే

– అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.
నవతెలంగాణ – కంటేశ్వర్
100 ఫీట్ల రోడ్డు మార్గాన్ని సర్వే చేపిస్తామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. వినాయక్ నగర్ నుండి గాయత్రి నగర్, చంద్ర నగర్, రేడియో స్టేషన్, నాగారం. అక్కడినుండి ఖిల్లా మీదుగా బోధన్ రోడ్డు వరకు మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచిన 100 ఫీట్ల రోడ్డును సర్వే చేయించి  ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని అంచనా వేయించి బాధితులను ఆదుకుంటానని, సంబంధిత అధికారులతో చర్చించి న్యాయం చేస్తానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాస్టర్ ప్లాన్ బాధితులకు హామీ ఇచ్చారు.  నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ బాధితుల కమిటీ ఎమ్మెల్యేను కలిసారు.  100 ఫీట్ల రోడ్డు మార్గం మూలంగా అనేకమంది పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా నష్టపోయి రోడ్డు పాలవుతారని, ఆ రోడ్డును మాస్టర్ ప్లాన్ నుండి తీసివేయాలని  అర్బన్ ఎమ్మెల్యేకు వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 100 ఫీట్ల రోడ్డు మూలంగా నష్టపోతున్న వారందరితో, అధికారులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.
Spread the love