
మండలంలోని జగన్నాథ్ పల్లి గ్రామంలో సోమవారం నాడు నూతన గ్రామపంచాయతీ భవననిర్మాణముభూమి పూజ చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పంచాయతీ భావన నిర్మాణం కొరకు 20లక్షలరూపాయలు నిధులు ప్రభుత్వం మంజరు కాగా భూమి చే సినట్లు తెలిపారు. నాణ్యత లోపం లేకుండా నిర్మించాలని సదరు గుత్తేదారునికి సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రంతి బాయి, మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, విఠల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మొగుల గౌడ్, కల్లూరి పండరీ తదితరులు పాల్గొన్నారు.