ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్..

– పరిశీలించిన సీపీఐ(ఎం) నాయకులు పుల్లయ్య…
నవతెలంగాణ – అశ్వారావుపేట
సోమవారం నిర్వహించిన వరంగల్ – నల్గొండ – ఖమ్మం పట్టభద్రుల నియోజక వర్గం ఎన్నికల పోలింగ్ అశ్వారావుపేట నియోజక వర్గంలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.పోలింగ్ సరళిని 2 గంటలకు ఒక సారి అధికారులు ప్రకటించారు.10 గంటలు వరకు స్తబ్దుగా సాగిన పోలింగ్ 11 గంటలు నుండి ఊపందుకుంది.క్యూ లైన్ లో ఓటర్లు బారులు తీరారు. ఈ పోలింగ్ ను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ,పిడమర్తి రవి,సీపీఐ(ఎం) నాయకులు పుల్లయ్య,చిరంజీవి,కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్,మొగుళ్ళు చెన్నకేశవ రావు,తుమ్మ రాంబాబు,టీఆర్ఎస్ నాయకులు శ్రీరామమూర్తి,యుఎస్ ప్రకాష్ రావులు పరిశీలించారు.
Spread the love