మందుల సామేల్ కు మద్దతుగా ఎమ్మార్పీఎస్ ప్రచారం

నవతెలంగాణ- తిరుమలగిరి : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాదిగ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మందుల సామేలు ను ఈనెల 30న జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి స్వాగతం పలకాలని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కందుకూరి సోమన్న కోరారు. మంగళవారం  తిరుమలగిరి మండలం మామిడాల గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో తుంగతుర్తి నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి చెందకపోగా ఎంతో వెనుకబడిపోయిందని అన్నారు.ప్రస్తుత శాసనసభ్యులు కేవలం బూ మాఫియా, గుండాయిజంతోనే ఈ ప్రాంతాన్ని పాలించారని  చెప్పారు. ఇప్పటికైనా స్థానికేతరుడైన తుంగతుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ ను ఈ ప్రాంతం నుండి తరిమి కొట్టాలని కోరారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే స్థానికుడైన మందుల సామెల్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా నాయకులు కందుకూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Spread the love