కాంగ్రెస్ గూటికి మోపాల్ ఎంపీపీ

నవతెలంగాణ – మోపాల్

మోపాల్ మండల ఎంపీపీ లతా కన్నీరం కాంగ్రెస్ గూటికి చేరారు. మండలంలోని కులాస్పూర్ ఎంపీటీసిగా బీఆర్ ఎస్ పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించిన లత మెజార్టీ సభ్యుల మద్దతుతో ఎంపీపీగా ఎన్నికయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. ఆదివారం ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఎంపీపీ లతా,  ఆమె భర్త సీనియర్ నాయకుడు కన్నీరం, కులాస్పూర్ తండా తాజా మాజీ సర్పంచ్ శ్రావణ్ కుమార్ తో పాటు, మండలానికి చెందిన పలువురు సీనియర్ బీ ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరారు.
Spread the love