![](https://navatelangana.com/wp-content/uploads/2024/02/ramareddy-15-1.jpg)
వాహనదారులు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని మంగళవారం స్థానిక ఎస్ ఐ సుధాకర్ వాహనదారులకు సూచించారు. మండల కేంద్రంలోని గంగమ్మ వగు వద్ద వాహనాల తనిఖీ ని సుధాకర్ ఆధ్వర్యంలో చేపట్టారు. పలు వాహనదారు రోడ్డు భద్రత నియమాలు పాటించని వారిపై కేసు నమోదు చేసి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక వాహనదారులు హెల్మెట్, సీటు బెల్టులను ధరించాలని, వాహన ధ్రువపత్రాలతోపాటు లైసెన్సులను కలిగి ఉండాలని సూచించారు. మైనర్లకు వాహనాలు నడపడానికి ఇవ్వరాదని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది చందు, పవన్ తదితరులు పాల్గొన్నారు.