- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్పై ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం కానుంచి మాజీ ఆర్మీ జనరల్ నరవాణీ బుక్, యూఎస్ ఒప్పందాలపై సభలో చర్చలు జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. భారత్ – అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం ఆందోళన చేపట్టారు. నేడు పార్లమెంటులోని మకర్ ద్వారం వద్ద ఇండియా బ్లాక్ ఎంపీలు ‘నరేందర్ లొంగిపోయారా? దేశం చూస్తోంది’ అని రాసిన ప్లకార్డుల్ని పట్టుకుని నిరసన చేశారు. ఈ పోస్టర్లో మోడీ.. ట్రంప్ ఎదుట సాగిలపడినట్టుగా కనిపిస్తుంది.
- Advertisement -



