లేఅవుట్ ప్లాన్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

నవతెలంగాణ –  తిరుమలగిరి
తిరుమలగిరి పట్టణ పరిధిలో గల పలు లేఅవుట్ లను టౌన్ ప్లానింగ్ అధికారితో కలిసి పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ పోతరాజు రజని రాజశేఖర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ2020,2021,2022,2023 సంవత్సరాల నుండి అసంపూర్తిగా ఉన్న, మున్సిపల్ చట్ట ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా, ఇప్పటి వరకు లేఔట్స్ లో ఉండాల్సిన వసతులు రోడ్లు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, పూర్తి చేయని లేఔట్ యజమానులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇచ్చిన సమయంలో పూర్తి చేయని లేఔట్స్ కు అనుమతులు పూర్తి స్థాయిలో తొలగించడం జరుగుతుందన్నారు. గతంలో లేఔట్ లను తనిఖీ చేయడంలో అలసత్వం వహించిన సంబందిత అధికారులపై క్రమశిక్షణ చర్యలకు త్వరలో పూర్తి స్థాయి నివేదిక పై అధికారులకు అందచేయటం జరుగుతోందని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి సోమయ్య మున్సిపల్ సిబ్బంది బుచ్చిబాబు ఖదీర్, పరశురాం నాయకులు అజయ్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Spread the love