నవతెలంగాణ – హైదరాబాద్ : భారత లెగ్ స్పిన్నర్ మురుగన్ అశ్విన్ తన సుదీర్ఘ క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలికాడు. దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు సోమవారం ప్రకటించాడు. 35 ఏండ్ల అశ్విన్, తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘ ప్రకటన ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తన ప్రకటనలో “దేశవాళీ క్రికెట్ కెరీర్కు, ఐపీఎల్ ప్రయాణానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాను. అయితే, నేను కొత్త సవాళ్లు, అవకాశాలను అన్వేషిస్తాను. ఎప్పటిలాగే పోటీ క్రికెట్ను కొనసాగించాలని ఆశిస్తున్నాను” అని అశ్విన్ పేర్కొన్నాడు.
మురుగన్ అశ్విన్ తన ఐపీఎల్ కెరీర్లో రైజింగ్ పుణె సూపర్జెయింట్, ఢిల్లీ డేర్డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ సహా మొత్తం ఆరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ప్రయాణంలో ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల నాయకత్వంలో ఆడే అవకాశం లభించడం తనను మెరుగైన క్రికెటర్గా తీర్చిదిద్దిందని ఆయన గుర్తుచేసుకున్నాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్సీఏ)కు అశ్విన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.


