గిరిప్రదక్షిణ చేయడంతో నా జన్మ ధన్యమైంది: బీర్ల ఐలయ్య 

– గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు 
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం యాదగిరిగుట్ట మంగళవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల ఐలయ్య స్వాతి నక్షత్రం సందర్భంగా సుమారు 10 వేల మందితో సామూహిక గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. ఈ గిరిప్రదక్షిణలో తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి ఆలేరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. జై బోలో లక్ష్మీనరసింహస్వామి అంటూ, భజనలు చేస్తూ, యధా ఋషి వద్ద నమస్కరించి గిరి ప్రదక్షిణ ముందుకు సాగింది విగ్రహం వద్ద నమస్కరించి ఈ గిరిప్రదక్షిణ కొనసాగించారు. గిరి ప్రదక్షిణ అనంతరం మెట్ల మార్గంలో కొండపైకి చేరుకుని సర్వదర్శనం క్యూలైన్లో ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదగిరి గౌడ్, యాదగిరిగుట్ట మాజీ ఉపసర్పంచ్ గుండ్లపల్లి భరత్ గౌడ్, ఎంపీపీ చీర శ్రీశైలం, కౌన్సిలర్ ముక్కెర్ల మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love