25న ఎల్బీ స్టేడియంలో నా పోలింగ్ నా బాధ్యత కార్యక్రమం 

– ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ పాల్గొనాలి
– జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి
నవతెలంగాణ – కంటేశ్వర్
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈ నెల 25వ తేదీన నిర్వహించే నా పోలింగ్ నా బాధ్యత కార్యక్రమంలో జిల్లా బూత్ లెవెల్ ఏజెంట్ లు అందరూ పాల్గొనాలి అని నిజాంబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తెలియజేశారు. ఈ నెల 25వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జి జనరల్ సెక్రెటరీ దీపికా దాస్ మున్షు  ఆలోచన మేరకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న నా పోలింగ్ బూత్ నా బాధ్యత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే గారు హాజరవుతున్నారు. కావున ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ 25వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే నా పోలింగ్ నా బాధ్యత కార్యక్రమంలో విధిగా హాజరు కావాలని, ఈ కార్యక్రమం 25వ తేదీ నాడు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుందని మానాల మోహన్ రెడ్డి తెలియజేశారు. అదే విధంగా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తమ బాధ్యతగా బూత్ ఏజెంట్లను ఏల్బి స్టేడియం కు పంపాలని, అదేవిధంగా నా పోలింగ్ నా బాధ్యత కార్యక్రమానికి బూత్ ఏజెంట్ల కొరకు పాసులు సిద్ధం చేస్తున్న సందర్భంగా వాటి వివరాలను కాంగ్రెస్ భవన్ కు పంపాలని మానాల మోహన్ రెడ్డి అన్నారు.
Spread the love