మిరుదొడ్డి మండల దళిత మోర్చా అధ్యక్షునిగా నక్క రాములు

నవతెలంగాణ – మిరుదొడ్డి 
భారతీయ జనతా దళిత మోర్చా మిరుదొడ్డి మండల అధ్యక్షులుగా నక్క రాములు నియమకం అయ్యారు. సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగడి మోహన్ రెడ్డి మరియు మెదక్ పార్లమెంటరీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గారి ఆదేశాలనుసారం మిరుదొడ్డి మండల బీజేపీ అధ్యక్షులు ఎలుముల దేవరాజు నియామక పత్రాన్ని అందజేశారు. దళిత మోర్చా అధ్యక్షులు నక్క రాములు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మిరుదొడ్డి మండల దళిత మోర్చా అధ్యక్షులుగా నియమించినందుకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. దళితుల హక్కులకై పోరాటం చేస్తూ దళితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పైన పోరాటం చేస్తూ దళితులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దళిత నాయకులు పాల్గొన్నారు.
Spread the love