నారాపాక శంకర్ కు మాతృవియోగం

నవతెలంగాణ – చండూరు 
చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ కార్మికుడు నారాపాక శంకర్ కు మాతృ వియోగం జరిగింది. తన తల్లి  వల్లమ్మ (76) అనారోగ్యంతో   నల్లగొండ లో  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.  గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ చండూరు మండల కమిటీ (సీఐటీయూ) ఆధ్వర్యంలో పూలమాలలు వేసినివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ గౌడ్ మాట్లాడుతూ.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ సీఐటీయూ అండగా ఉంటుందనివారు తెలిపారు. ఈ కార్యక్రమంలో  కుమారుడు నారాపాక శంకర్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ చండూరు మండల అధ్యక్షులునాంపల్లి శంకర్, మండల సహాయ కార్యదర్శి వెంకటాచారి, మండల ఉపాధ్యక్షులు నాగిళ్ల లక్ష్మణ్, మండల నాయకులు  ఈరటి దేవరాజ్, నారపాక యాదయ్య, నారపాక మల్లయ్య, లక్ష్మయ్య, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
Spread the love