సాగర్ సందర్శించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం

– వీరితో పాటు ఆంధ్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు
– మూడు రోజుల పాటు కొనసాగనున్న పరిశీలన
నవతెలంగాణ – నాగార్జునసాగర్
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును13,14,15వ తేదీల్లో మూడు రోజుల పాటు నాగార్జునసాగర్ డ్యామ్‌ పరిశీలనలో భాగంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృంద సభ్యులు  సోమవారం సాగర్ విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్నారు.సాగర్ చేరుకున్న సభ్యుల బృందానికి నీటిపారుదల శాఖ ఎస్.ఈ  నాగేశ్వరరావు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లికార్జున్ పలువురు అధికారులు స్వాగతం పలికారు.అనంతరం విజయ విహార్ అతిథి గృహంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు, సిడబ్ల్యుసి, కృష్ణ రివర్ బోర్డు సభ్యులు మరియు ఆంధ్ర తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు.అనంతరం ప్రాజెక్ట్  మూడు  రోజుల సందర్శనలో భాగంగా సీడబ్ల్యూసీ, కే‎ఆర్‌ఎంబీ, ఏపీ,తెలంగాణ ఇరు రాష్ట్రాల నీటిపారుల శాఖ అధికారుల తో కలిసి మంగళవారం సాగర్‌ ప్రధాన డ్యాం, గేట్లు, గ్యాలరీ, కుడికాలువ, హెడ్‌ రెగ్యులేటర్, జలవిద్యుత్‌ కేంద్రం, క్రస్ట్‌గేట్లను, 220, 420 గ్యాలరీలను వాక్‌వే మీద నుంచి స్పిల్‌వేను పరిశీలించడం జరిగింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలాశయం కెఆర్ఎంబి పరిధిలోకి తీసుకురానున్న నేపథ్యంలో డ్యాం భద్రత, నీటి నిల్వలు మరియు వినియోగంపై పూర్తిస్థాయిలో నిపుణుల బృందం అధ్యయనం చేసింది. జలాశయం భద్రత, నీటి నిల్వలు, నీటి వినియోగంపై సమగ్రంగా పరిశీలించి నాగార్జున సాగర్ డ్యాం జలాశయం వివరాలను డ్యామ్  నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.గతంలో 2009 లో వచ్చిన వరదలకు ఎంతమేర వరద ప్రవాహం వచ్చింది. జలాశయం నుంచి ఎన్ని వేల క్యూసెక్కుల వరదనీరు గేట్ల ద్వారా విడుదల చేశారు. గేట్ల ద్వారా వరదనీరు విడుదల చేస్తున్న సమయంలో ఏమైనా ఇబ్బంది కలిగిందా అంటూ ఆరా తీశారు.డ్యామ్ జలాశయానికి సంబంధించిన ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలను డ్యామ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.జలాశయానికి సంబంధించిన గేట్స్, గ్యాలరీ, రోప్స్ ను పరిశీలించి వాటి పనితీరు తదితర వివరాలను పూర్తిగా అడిగి తెలుసుకున్నారు.గత నెల 9న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో తెలంగాణ, ఏపీతో సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమల్లో భాగంగా.. సీడబ్ల్యూసీ డైరెక్టర్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్డీఎస్‌ఏ ,కెఆర్ఎంబి , సీడబ్ల్యూసీ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర నీటుపారుల శాఖ  సంబంధించిన 13 మంది బృంద సభ్యులు జలాశయాన్ని సందర్శించారు.ఎస్.డి.ఎస్.ఓ చైర్మన్ సి డబ్ల్యూ సి డైరెక్టర్ రమేష్ కుమార్,సభ్యులు సి.ఈ  ప్రమీల,ఎస్.ఈ శ్రీనివాస్,ఈఈ విజయలక్ష్మి,డి.ఈ సతీష్ మరియు ఎ.ఈ లు, వీరి వెంట తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు సి.ఈ విజయ్ కుమార్,ఎస్.ఈ నాగేశ్వరరావు,ఈ.ఈ మల్లికార్జున,డి.ఈ శ్రీనివాస్ రావు,పాపారావు,ఏ.ఈ కృష్ణయ్య,సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ నీటిపారుల శాఖ అధికారులు సి.ఈ మురళీధర్ రెడ్డి,ఎస్.ఈ వరలక్ష్మి,ఈఈ శ్రీ హరి,డి.ఈ మురళీధర్ మరియు సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్,నాగార్జునసాగర్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ , అసిస్టెంట్ కమాండెంట్, ఇరిగేషన్  అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love