– నైతిక విజయం కాంగ్రెస్దే: మంత్రి జూపల్లి కృష్ణారావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్రెడ్డి సాంకేతికంగా మాత్రమే గెలిచారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ ఎన్నికల్లో నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ఆదివారం హైదరాబాద్లోని సచివాలయం మీడియా పాయింట్లో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి విలేకర్లతో మాట్లాడారు. వీన్కుమార్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కేవలం 111 ఓట్లతో గెలుపొందారని తెలిపారు. మొత్తం 1,437 ఓట్లు పోలయ్యాయనీ, కాంగ్రెస్కు 300 ఓట్లు ఉండగా, అవి 652 ఓట్లకు పెరిగాయని చెప్పారు. బీఆర్ఎస్కు 763, కాంగ్రెస్కు 652 ఓట్లు వచ్చాయని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీల స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్కు ఓటు వేశారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాతే కేటీఆర్ మాట్లాడాలని సూచించారు. మరో 48 గంటల్లో ఎవరు భూస్థాపితమవుతారో తేలుతుందని హెచ్చరించారు. నిజాయితీగా ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అభినందించారు.