నితీశ్‌కు గాయం

నితీశ్‌కు గాయం– జింబాబ్వే పర్యటనకు దూరం
– జట్టులోకి శివం దూబె
ముంబయి : టీమ్‌ ఇండియా అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకున్న తెలుగు తేజం, సన్‌రైజర్స్‌ వర్థమాన ఆటగాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఆనందం ఆవిరైంది. భారత టీ20 జట్టులో చోటు సాధించిన తొలి ఆంధ్రా క్రికెటర్‌గా నిలిచిన నితీశ్‌ కుమార్‌.. హెర్నియా గాయంతో జింబాబ్వే పర్యటనకు దూరమయ్యాడు. టీ20 జట్టుకు ఎంపికైన నితీశ్‌ కుమార్‌కు ఎన్‌సీఏలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ గాయం బయటపడినట్టు తెలుస్తోంది!. నితీశ్‌ కుమార్‌ రెడ్డి స్థానంలో మరో పేస్‌ ఆల్‌రౌండర్‌ శివం దూబె జట్టులోకి ఎంపికయ్యాడు. ఈ మేరకు సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ నిర్ణయాన్ని బీసీసీఐ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. భారత జట్టు జింబాబ్వే పర్యటనలో ఐదు టీ20లు ఆడనుంది. శుభ్‌మన్‌ గిల్‌ భారత జట్టుకు కెప్టెన్సీ వహించనున్నాడు. గాయంతో హైదరాబాదీ స్టార్‌ తిలక్‌ వర్మ ఇప్పటికే జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే!.

Spread the love