ఎన్నికల నిబంధన తో నామినేషన్ ప్రక్రియ..

– ప్రశాంతంగా జరపాలి..
– జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి..
నవతెలంగాణ – ధూల్ పేట్
ఎన్నికల నిబంధనల, నియమావళి ప్రకారం నామినేషన్ల ప్రక్రియ కొనసాగించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి అధికారులకు ఆదేశించారు. ఈ నెల 3వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో  ఆయన గురువారం మొగల్ పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని  చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం  ఎన్నికల రిటర్నింగ్, మలక్ పేట్, బహదూర్ పుర హైదారాబాద్ అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్  కార్యాలయాలని సందర్శించారు. నామినేషన్ల ప్రక్రియకు తీసుకుంటున్న ఏర్పాట్ల పై నియోజకవర్గంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి  వెంకన్నతో ఆయా నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులను  ఆరా తీశారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకన్న తో పాటు నోడల్ అధికారి, చార్మినార్ డివిజన్ ఏసిపి  రుద్ర భాస్కర్, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అనుసరించాలన్నారు. ఈ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా  జరిగేందుకు  అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Spread the love