ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ.

– రాంసాగర్ సర్పంచ్ కొండారి సంధ్యారాణి గణేష్.
నవతెలంగాణ- రాయపోల్
తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకొని తెలంగాణ సాంప్రదాయాలను కాపాడుకుంటూ మహిళను గౌరవించుకోవాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి కెసిఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని రాంసాగర్ సర్పంచ్ కొండారి సంధ్యారాణి గణేష్ అన్నారు. గురువారం రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి వినూత్న కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేకం చేపట్టారని దానిలో భాగంగానే బతుకమ్మ పండుగకు మహిళలకు చీరల పంపిణీ చేసి, వారికి మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. అలాగే క్రిష్టియన్లకు క్రిస్మస్ పండుగకు, ముస్లింలకు రంజాన్ పండుగలకు కూడా బట్టలు పంపిణీ చేసి అన్ని కుల, మతాల బేధాలు లేకుండా అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సాయల్ల లక్ష్మి, ఉప సర్పంచ్ రాజిరెడ్డి, వార్డు సభ్యులు కొండారి రమేష్, కల్లూరి బిక్షపతి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, అంగన్వాడి టీచర్ జ్యోతి,వివోఏలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love