చెరువును తలపిస్తున్న ఓదెల రైల్వే అండర్ బ్రిడ్జి

– తీవ్ర ఇబ్బందుల్లో ప్రయాణికులు
నవతెలంగాణ-ఓదెల: ఓదెల మండల కేంద్రంలో ఓదెల గ్రామం నుండి కొమిర,పొత్కపల్లి గ్రామాలతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లేందుకు రైల్వే అధికారులు అండర్ బ్రిడ్జిని నిర్మించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు చేరి రైల్వే అండర్ బ్రిడ్జి చెరువును తలపిస్తుంది.దీని వలన ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడడమే కాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Spread the love