పదవీకాలం పూర్తయిన సర్పంచులను సన్మానించిన అధికారులు

నవతెలంగాణ – తిరుమలగిరి
పదవీ కాలం పూర్తయిన సందర్భంగా తిరుమలగిరి మండల పరిధిలోని పలు గ్రామాల సర్పంచులను గురువారం తిరుమలగిరి మండల పరిషత్ కార్యాలయంలో  ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సన్మానించి మేమొంటోను అందజేశారు. అనంతరం ఎంపీపీ నెమరుగో మ్ముల స్నేహలత, జడ్పిటిసి దుపటి అంజలి రవీందర్ మాట్లాడుతూ సర్పంచ్ లు తమ ఐదు సంవత్సరాల కాలంలో గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం  ప్రజల కోసమే పని చేశారని అన్నారు. సర్పంచ్ గా గెలిచిన వారు తమ పదవి కాలంలో చేసిన సేవలు ఎల్లవేళలా ప్రజలకు గుర్తు ఉంటాయని అన్నారు. పదవిలో ఉన్న నాడు గ్రామ ప్రజలతో పాటు అధికారులతో కలిసిమెలిసి ఉండి అభివృద్ధిలో భాగస్వామమైన ప్రజా ప్రతినిదులు ఏదో ఒక స్థాయిలో పదవులు పొందడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వారి తో పాటు సర్పంచులు ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Spread the love