జీ5 గత వారం ‘పంచనామా’ అన ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఈనెల 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్కి నిర్మాత, షో రన్నర్గా ఉదయభాను వ్యవహరించారు. ఆరు ఎపిసోడ్స్తో వచ్చిన ఈ మొదటి సీజన్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఆరు ఎపిసోడ్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండటంతో ఆడియెన్స్ ఈ సిరీస్ను ఎక్కువగా వీక్షిస్తున్నారు. వరుసగా మూడు హత్యలు జరగడం, పోలీస్ ఇన్వెస్టి గేషన్, ఒక్క క్లూ కూడా దొరక్కపోవడం, చివరకు ఈ హత్యల వెనుకున్న కారణాన్ని తెలుసుకోవడం.. వంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సిరీస్ ఎంతో ఉత్కంఠ భరితంగా మారింది. ఈ మొదటి సీజన్ క్లైమాక్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇక వెంటనే రెండో సీజన్ చూసేయాలన్నంత ఇంట్రెస్ట్ కలిగించేలా ఈ మొదటి సీజన్ను తెరకెక్కించారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులకు ‘పంచనామా’ కచ్చితంగా నచ్చుతుంది. అందుకే జీ5లో కేవలం వారం రోజుల్లోనే 25 మిలియన్ల డిజిటల్ స్ట్రీమింగ్ మినిట్స్ను క్రాస్ చేసింది అని మేకర్స్ తెలిపారు.
‘పంచనామా’కి విశేష ఆదరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



