బీఆర్‌ఎస్‌ని గెలిపించాలని కోరుతూ పైళ్ల సతీమణి వనిత ఇంటింటి ప్రచారం

నవతెలంగాణ- వలిగొండ రూరల్:  వచ్చే ఎన్నికల్లో భువనగిరి ఎమ్మెల్యే గా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ని అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ఆయన సతీమణి పైళ్ల వనిత అన్నారు. శుక్రవారం మండలంలోని రెడ్లరేపాక, కంచన పల్లి గ్రామాలలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భముగా ఆమె మాట్లాడుతు సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు  ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. వీటితో పాటు శేఖర్ రెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వఛే ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు అత్యధిక ఓట్లు వేసి  అత్యంత మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ల రేపాక సర్పంచ్ రేపాక అరుంధతి, సందీప్ రెడ్డి, మాద శంకర్, సూర్యనారాయణ, మల్లికార్జున్, శ్రీనివాస్ రెడ్డి, డేగల పాండు, పెద్దిటి సత్తిరెడ్డి, కొమురెల్లి సంజీవరెడ్డి, ఎoపాల ఝాన్ రెడ్డి, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love