‘పెద్ది’ వంటి రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు హీరో రామ్చరణ్ సిద్ధమవుతున్నారు. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వద్ధి సినిమాస్ బ్యానర్పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటైన ‘పెద్ది’ ఫైనల్ ఎడిట్ను మేకర్స్ లాక్ చేశారు. దీంతో ఈ సిని మాకు సంబం ధించిన ఫైనల్ కౌంట్డౌన్ ప్రారంభమైంది. షార్ఫ్, ఎమోషనల్ డెప్త్ తీసుకురావడంలో పేరుపొందిన జాతీయ అవార్డు గ్రహీత, ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. బుచ్చి బాబు సానా గ్రేట్ విజన్తో ఎమోషన్, యాక్షన్, గ్రాండియర్తో నిండిన ఒక భారీ సినిమాటిక్ అనుభూతిని ఈ చిత్రం అందించబోతుంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటించారు. రూరల్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, బలమైన భావోద్వేగాలతో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో పలు దక్షిణ భారతీయ భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. ప్రేక్షకులు, రామ్చరణ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు జూన్ 3న ప్రీమియర్ షోలు వేస్తున్నారు.



