పేటలో చికెన్ సిండికేట్..

– మాంసాహారులు ను దోచుకుంటున్న దుకాణాల యజమానులు..
– మార్కెట్ ధర లు అనుసరించే వారి పై సిండికేట్ దాడులు..
– స్వతంత్ర వ్యాపారులకు సహాయ నిరాకరణ..
నవతెలంగాణ – అశ్వారావుపేట 
మాంసం మద్యం, విద్యా కాదేదీ సిండికేట్ కు అనర్హం అనే రాష్ట్ర వ్యాప్త అంశాన్ని అశ్వారావుపేట లో పలు వ్యాపారాల యజమానులు సిండికేట్ గా ఏర్పడి రుజువు చేస్తున్నారు. అయితే గతం లో ఏ వ్యాపారులు అయిన సంఘాలు గా లేక యూనియన్ లు గా ఏర్పాటు అయి వారి కార్యకలాపాలు నిర్వహించేవి. నేడు అవి యూనియన్ లు లేక సంఘాలు గా నే ఉనికిలో ఉన్నప్పటికీ సిండికేట్ అనే పదం పర్యాయ పదం అయింది. అశ్వారావుపేట లో ఇప్పటికే మద్యం వ్యాపారులు సిండికేట్ గా ఉనికిలో ఉన్నారు.ప్రస్తుతం చికెన్ సెంటర్ ల యాజమాన్యాలు ప్రస్తుతం సిండికేట్ గా రూపాంతరం చెందింది. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో నూ,అశ్వారావుపేట లో మొత్తంగా 15 నుండి 20 చికెన్ సెంటర్ లు ఉన్నాయి. వీరందరూ సిండికేట్ గా తయారై మార్కెట్ ధర కు మించి రూ.20 లు నుండి రూ.60 లు వరకు కేజీ చికెన్ కు వసూలు చేస్తుంటారని పలువురు మాంసాహారులు తెలుపుతున్నారు. అయితే షౌకత్ చికెన్ సెంటర్ యజమాని మార్కెట్ ధర కంటే రూ.10 లు నుండి రూ.20 లు వరకు కేజీ చికెన్ మాంసాన్ని విక్రయిస్తుంటారు. పైగా ధర తెలిసేలా బోర్డు పెట్టి మరీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో యూనియన్ నాయకులు తక్కువ ధరకు విక్రయించొద్దని, విక్రయించి నా బోర్డు పెట్టవద్దని తెలిపారు.అయినా షౌకత్ తన పాత పద్ధతి ప్రకారం వ్యాపారం చేయడంలో ఇతని షాపు లో కార్మికుడు శ్రీనివాస్ కు యూనియన్ నాయకుడు హేమంత్ కు ధరలు విషయం అయి వివాదం చోటు చేసుకుంది.వివాదం కాస్తా గొడవకు దారితీసి కార్మికుడు శ్రీనివాస్ పై దాడి చేయడంతో గాయాలు అయ్యాయని శ్రీనివాస్ పోలీస్ లకు పిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. ప్రస్తుతం మార్కెట్ లో బ్రాయిలర్ చికెన్ కేజీ మాంసం రూ.239 లు ఉంది.కానీ షౌకత్ రూ.200 లు కే బోర్డు పెట్టి విక్రయిస్తున్నారని యూనియన్ నాయకుడు హేమంత్ తెలిపారు. నా వ్యాపారం నా ఇష్టం అని నేను తక్కువుగా అమ్ముతున్నానని మిగతా వ్యాపారులు నాకు సహాయం నిరాకరణ కు పాల్పడుతూ కంపెనీ ల నుండి నాకు కోళ్ళు సరఫరా నిలిపి వేయాలని కంపెనీ వాళ్ళను డిమాండ్ చేస్తున్నారని షౌకత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Spread the love