
అహిల్యాబాయ్ హోల్కర్ సమాజ హట్కర్ బాంధవులకు కమిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా హట్కర్ సమాజ నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో సోమవారం నాడు జై మళ్లర్ అహిల్యాబాయ్ హోల్కర్ కమిటీ హాల్ గురించి హట్కర్ ధనగార్ సమాజ్ బాంధవులు పార్టీకు అతీతంగా దోస్పల్లి రోడ్డు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ పక్కనే ఉన్న స్థలంలో సమావేశం నిర్వహించి మెయిన్ రోడ్ కి దగ్గరలో కమీటి హాల్ భూమి పూజా చేసి జండా పాతడం జరిగింది. త్వరలో జుక్కల్ మండల కేంద్రంలోని అహీల్యబాయి హోల్కర్ విగ్రహం ఆవిష్కరణ చేస్తామని హట్కర్ ధన్గర్ సమాజ్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జై మల్లర్ హాట్కార్ ధనగర్ సమాజ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.