ఫేస్ బుక్ లో పోస్ట్..

– బీఅర్ఎస్ మండల అధ్యక్షునిపై కేసు నమోదు..
– నా పరువుకు భంగం కల్పించారు.
– మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ముదిరాజ్..
నవతెలంగాణ -డిచ్ పల్లి
ఫేస్ బుక్ లో పోస్ట్ ను ఇందల్ వాయి బీఅర్ఎస్ మండల అధ్యక్షులు చిలువేరి గంగదాస్ దర్పల్లి మాజీ ఎంపీపీ, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి ముదిరాజ్ పై పోస్ట్ పెట్టడంతో తన పరువుకు భంగం కలిగించరని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలిసులు కేసు నమోదు చేసినట్లు ఇమ్మడి గోపి ఆదివారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందల్ వాయి మండల బీఅర్ఎస్ అధ్యక్షుడు చిలువేరి గంగదాస్  తన ఫేస్ బుక్అకౌంట్ లో వీడియో పెట్టి “మహిళను తన్నినవాడికి కండవా కప్పిన పేవంత్ అని పోస్టు చేసాడని, అ వీడియోలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తో నేను దిగిన ఫోటో ను పెట్టడన్నారు.ఈ పోస్ట్ ను ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామానికి చెందిన గంగాధర్ చూసి వేంటనే ఫోన్ ద్వారా పంపించడాని,ఇలా ఫేస్ బుక్ లో చిలివేరి దాస్ పేట్టిన పోస్టు వల్లా రెండు వర్గాల మధ్య గొడవలు జరిగే విధంగా ఉన్నాయని ఇమ్మడి గోపి పేర్కొన్నారు. ఇందల్ వాయి మండలములో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాడని, ఇదే విషయాన్ని చిలివేరి దాస్ కు ఎందుకు పోస్ట పెట్టినావని అడిగితే ఎం చేసుకుంటావో చేసుకో అని బెదిరించిండాని, అని పోస్ట్ వల్లా  నా పరువుకు భంగం కలిగిందని ఇమ్మడి గోపి వాపోయారు. దీన్నంతటికి కారణమైన చిలివేరి గంగదాసు పై చట్టప్రకారం చర్య తీసుకోవలని ఇమ్మడి గోపి ఇచ్చిన ఫిర్యాదు లో కోరారు.పోలిసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Spread the love