– ప్రజావాణి మోడల్ అధికారి దివ్య..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
హైదరాబాద్ మహాత్మా బాపు రావు పూలే ప్రజా భవన్ లో మంగళవారం నాడు జరిగే ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా వేయడం జరిగిందని ప్రజావాణి నోడల్ అధికారి దివ్య సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాభవన్ లో 16వ ఆర్థిక సంఘం సమావేశాలు జరుగుతున్నందున సెప్టెంబర్ 10వ తేదీన మంగళవారం నాడు నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం సెప్టెంబర్ 11వ తేదీ బుధవారానికి వాయిదా వేసినట్లు తెలిపారు. ఆర్జీదారులందరూ ఈ మార్పును గమనించి తేదీ. 11.09.2024 బుధవారం నాడు ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.