గ్యాస్, చమురు ధరలను పెంచి దేశ ప్రజలను వంచించిన  ప్రధాని మోడీ

– పేదలపై పన్నులు,  సంపన్నులకు రాయితీలు నరేంద్ర మోడీ నయా వంచన పాలన
– సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ కామారెడ్డి జిల్లా నాయకులు ఏ ప్రకాష్
నవతెలంగాణ –  కామారెడ్డి 
వంట గ్యాస్, చమురు ధరలను పెంచి దేశ ప్రజలను ప్రధాని మోడీ వంచించారని, పేదలపై పన్నులు పెంచుతు సంపన్నులకు రాయితీలు ఇస్తు నరేంద్ర మోడీ నయా వంచన పాలనచేస్తున్నాడని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ కామారెడ్డి జిల్లా నాయకులు ఏ ప్రకాష్ తీవ్రంగా విమర్శంచారు. గురువారం  కేంద్రం ప్రభుత్వం పెంచిన చమురు ధరలు, వంట గ్యాస్ ధరలకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్  రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఎదురుగా  కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ కామారెడ్డి జిల్లా నాయకులు ప్రకాష్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్లుగా సంపన్నులైనా కార్పొరేట్ల కోమ్ముకస్తు దేశ ప్రజల పై ముఖ్యంగా పేదలపై  ధరలు, పన్నులు పెంచి  వాళ్ల వెన్ను వీరుస్తున్నారన్నారు.
ప్రపంచవ్యాప్తంగా చమురు – క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గిన ఇక్కడి పెట్టుబడిదారుల కు వత్తాసు పలుకుతూ  పెట్రోల్, వంట గ్యాస్ ధరలు పెంచడం సిగ్గుచేటు అన్నారు. మతం మత్తులో దేశ ప్రజలను ముంచి తుగ్లక్ ను మించిన మతి లేని పరిపాలన చేస్తున్నాడు అన్నారు. ప్రజల మస్థికాన్ని పక్కదోవపట్టిస్తు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారన్నారు. ధరలు, నిరుద్యోగం, ఆకలి, పేదరికం, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలను పట్టించుకోకుండా, పరిష్కరించకుండ  మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఇట్లా ప్రజలను మరింత భారం వేయడం శోచనీయం అన్నారు. కేంద్రం పేదల పొట్టకొట్టడం తప్ప పేదలను ఆదుకున్నది లేదు అన్నారు. కోటిశ్వరులకు మేలు చేసేందుకే చమురు – వంట గ్యాస్ లను పెంచి తమ నైజం చాటుకున్నారు అన్నారు.
ఇప్పటికైనా ప్రధాని మోడీ పెంచిన ధరలను తాగించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఈ   కార్యక్రమంలో పీ, వో,  డబ్ల్యూ జిల్లా నాయకులు అనిత ,హేమలత ,స్వర్ణ, కార్మిక సంఘం నాయకులు నారాయణ, రమేష్ పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు జి సురేష్ జిల్లా నాయకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love