Monday, May 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనార్వేలో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌

నార్వేలో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పీఎం మోడీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌తో బీజీ బీజీగా ఉన్నారు. ఐదు దేశాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా యూఏఈ, నెద‌ర్లాండ్ వెళ్లారు. ఆ దేశాల ప‌ర్య‌ట‌న‌ల‌తో తాజాగా సోమవారం ఆయ‌న అర్ధ‌రాత్రి ఉద‌యించే దేశం నార్వేకు వెళ్లారు. విమానాశ్రయంలో మోడీకి నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్ ఘనంగా స్వాగతం పలికారు. నాలుగు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని మోడీ తొలిసారి నార్వే చేయడం గమానార్హం. మే 19న 3వ ఇండియా – నార్డిక్‌ శిఖరాగ్ర సమావేశం ఓస్లోలో జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకే మోడీ సోమవారం (మే 18) ఓస్లోకి చేరుకున్నారు.

కాగా, ఇటీవల యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఇఎఫ్‌‌టిఎ) ఒప్పందం నేపథ్యంలో భారత్.. నార్వే స్నేహానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని తాను విశ్వాసంతో ఉన్నానని ప్రధాని మోడీ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -