ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి

నవతెలంగాణ – శంకరపట్నం
ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి నీ పురస్కరించుకొని శంకరపట్నం మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మండలాధ్యక్షులు తాటికొండ సదానంద చారి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి  ఘనంగా నివాళులు అర్పించారు.  అనంతరం పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన విశ్వబ్రాహ్మణ బిడ్డలను అన్ని రకాల ఆదుకోవాలని నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగాలు ఇప్పించాలని 50 సంవత్సరాలు నిండిన ప్రతి విశ్వకర్మ బిడ్డకు పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నరసింగోజు కృష్ణచారి, సీనియర్ జర్నలిస్టు జక్కోజు రమేష్ చారి, ప్రచార కార్యదర్శి కస్తూరి రమేష్ చారి, నర్శింగోజు సంతోష్ చారి, కృష్ణాచారి, మంతెన శ్రీనివాస్ చారి, ఎలుబాక సమ్మయాచారి, బైరి రాజమౌళి శ్రీనివాస్ కుమార్ మరియు ఇతర కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love