విద్యకు చేస్తున్న కృషి అభినందనీయం: పీఆర్ టీయూ

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలంలోని చింతలగూడెం, దామెర గ్రామాలలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల బాల బాలికలకు మంగళవారం ఉచిత వైద్య శిబిరం దివీస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దామెర పాఠశాల ప్రధానోపాధ్యాయులు భీమిల ఉపేందర్ జీ మాట్లాడుతూ దివీస్ చేస్తున్న కృషి అటు గ్రామాలకు ఇటు విద్యార్థులకు  కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని చెప్పారు. అనంతరం డాక్టర్ జయంత్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి పిల్లలకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు.దివీస్ సమకూర్చిన బ్యాగులు పాదరక్షలు భీమిడి ఉపేందర్ జీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చింతలగూడెం సర్పంచ్ ఏ.రేణుకగణేష్ దివీస్ సిఎస్ఆర్ ఇంచార్జ్ వల్లూరి వెంకటరాజు,సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love