కేసీఆర్ అహంకార పాలనను తుద ముట్టించండి

నవతెలంగాణ- నకిరేకల్: రాష్ట్రంలో కేసీఆర్ అహంకార పాలనను తుద ముట్టించాలని  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం పేర్కొన్నారు. బుధవారం మండలంలోని మంగళపల్లి, నరసింహపురం, తాటికల్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ లో నిధులు, నియామకాలు, నీళ్లు ఇవ్వలేదన్నారు. తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఉద్యోగం పోతనే మన యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికలలో హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, ఎంపీపీ బాచుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు, నాయకులు గాధగోని కొండయ్య, మిర్యాల చంద్రశేఖర్, మాలే నవీన్, బచుపల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు.
Spread the love