నల్గొండ ఎంపీగా భారీ మెజార్టీతో రఘువీర్ రెడ్డి గెలుపు..

నవతెలంగాణ – నాగార్జునసాగర్
నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా కుందూరు రఘువీర్ రెడ్డి రూ.5 లక్షల52 వేల పై చిలుకు మెజార్టీతో గెలుపు పట్ల నందికొండ మున్సిపాలిటీ మూడవ వార్డు కౌన్సిలర్ శిరీష మోహన్ నాయక్ మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మూడో వార్డులో ఇంటింటికి తిరిగి స్వీట్లు పంపిణీ చేసి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఇంత పెద్ద భారీ మెజార్టీని ఇచ్చిన నల్లగొండ పార్లమెంటులోని ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం భారీ మెజారిటీతో గెలుపొందిన రఘువీర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అల్ ఇండియా బంజారా సేవాసంఘం సాగర్ పట్టణ అధ్యక్షుడు మోహన్ నాయక్,నరసింహ రావు(చిన్ని),జనార్దన్,కండేలా వెంకటేశ్వర్లు మరియు వార్డు సభ్యులు తదితరులున్నారు.
Spread the love