మహిళా హింసను నిర్మూలించాలని ర్యాలీ 

నవతెలంగాణ – నకిరేకల్ 
సమాజంలో పెరిగిపోతున్న మహిళా హింసను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ చేయూత ను అందించాలని నలోగ్స్ జిల్లా కార్యదర్శి డాక్టర్ రాపోలు మంజుల కోరారు. శనివారం నకిరేకల్ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో మహిళా హింసకు వ్యతిరేకంగా నలోగ్స్ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజురోజుకు సమాజంలో మహిళ హింస పెరిగిపోతుందన్నారు. దీనివల్ల మహిళలు అన్ని రంగాలలో వెనుకబడి పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మహిళా హింస పెరగకుండా తమ వంతు సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సుశ్రుత, శ్రీకాంత్, కే సుచరిత, వివిధ హాస్పిటల్ సిబ్బంది వినయ్, హరీష్, శివ, వెంకటలక్ష్మి, పద్మ, జయ పాల్గొన్నారు.
Spread the love