మానవత్వం చాటుకున్న ఏనుగు రవీందర్ రెడ్డి

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామానికి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఊదరి సంజీవ కొన్ని రోజులు గా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ మండల కోశాధికారి ఏనుగు రవీందర్ రెడ్డి మానవ తా దృక్పథంతో 5,000 ఆర్థిక సాయం సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ధర్మాజీగూడెం గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చిన అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ధర్మోజిగూడెం గ్రామ అభివృద్ధి తన లక్ష్యంగా భావిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాజీ ఉపసర్పంచ్ బత్తుల శ్రీహరి ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఊదరి శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు డాకోజి సతీష్,ఐతరాజు శ్రీకాంత్, జంగం సందీప్, ఊదరి రాజ్ కుమార్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love