మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్ను డీసీపీ రాజా మహేందర్ నాయక్ ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, రిసెప్షన్, లాకప్, పరిసరాలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వారి విధులకు సంబంధించిన సూచనలు చేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సై సందీప్ కు పలు సూచనలు చేశారు. ఎళ్లవేళలా ఫిర్యాదులు స్వీకరించడం, బాధితుల ఫిర్యాదుపై సత్వరం స్పందించి సేవలు అందించాలని చెప్పారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజలను చైతన్య పర్చాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఆయన వెంట వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య ఉన్నారు.