Sunday, May 17, 2026
E-PAPER
Homeఆటలుఆర్సీబీ మ‌రోసారి భారీ స్కోర్

ఆర్సీబీ మ‌రోసారి భారీ స్కోర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. పంజాబ్‌కు 223 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. విరాట్ కోహ్లీ(58), వెంకటేశ్ అయ్యర్‌ వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుని హాఫ్ సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. బెథెల్(11) మరోసారి విఫలమయ్యారు. దేవదత్ పడిక్కల్(45), టిమ్ డేవిడ్(28) క్రీజులో ఉన్నంత సేపు దూకుడుగా ఆడారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 2, అర్ష్‌దీప్ సింగ్, చాహల్ తలొక వికెట్ పడగొట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -