జీపీ ఆస్తుల భద్రత , నిర్వహణ రిజిష్టర్ల ను ఏర్పాటు చేయాలి

నవతెలంగాణ – జుక్కల్: మండల ప్రజా పరిషత్ కార్యాలయం జుక్కల్ నందు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయటం జర్గింది. ఈ సందర్భంగా ఎంపిడివో బి.శ్రీనివాస్, ఎంపివో యాదగిరి ముప్పై గ్రామ పంచాయతీల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. జీపీ పరిధి లో గల ఆస్తులు అనగా కాంపోస్ట్ షెడ్ ,వైకుంఠధామం, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణముల నిర్వహణ, కంపోస్ట్ శెడ్ల యందు తడి పొడి చెత్త సేకరణ, కంపోస్ట్ తయారీ, కంపోస్టు ఎరువు పొడి చెత్త అమ్మకం ద్వారా వచ్చే ఆదాయము, సంబంధిత ఆస్తుల నిర్వహణ రిజిస్టర్లు తదితర అంశములపై పంచాయతీ కార్యదర్శులకు దిశానిర్దేశము చేశారు. ఈ సమావేశంలో ఎంపీడీవో, ఎంపీఓ, గ్రామపంచాయతి కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love