కోహెడ గ్రామపంచాయితీ ఆధ్వర్యంలో 27న కిరాయి వేలం

నవతెలంగాణ – కోహెడ
మండల కేంద్రంలో వారసంత, గ్రామపంచాయితి పాత భవనముల సముదాయాన్ని ఈ నెల 27న గ్రామ పంచాయితి కార్యాలయం వద్ద వేలం వేయనున్నట్లు పంచాయితి కార్యదర్శి దెవేందర్‌ రాథోడ్‌ తెలిపారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 27న అంగడి వేలంతో పాటు, గ్రామపంచాయితి 3 పాత భవనాల షెటర్లను కిరాయికి ఇచ్చేందుకు వేలం నిర్వహిస్తామన్నారు. బహిరంగ వేలంలో పాల్గొనే వారు గ్రామ పంచాయితీకి ఎలాంటి బకాయిలు ఉండరాదని సూచించారు. అలాగే రూ. 50 వేల డీడీ లేదా నగదుతో ముందుగా గ్రామపంచాయితిలో సమర్పించాలని సూచించారు. వేలంలో దక్కించుకున్నవారు నాలుగవ వంతు రూపాయలను వెంటనే చెల్లించాలన్నారు. వేలం కాలపరిమితి జూలై 1 నుండి 31 మార్చి 2025 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Spread the love